గోపాల్పేట, జనవరి 11 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలో ని అన్ని గ్రామాల్లో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లను అలంకరించి డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ప్రదర్శన నిచ్చారు. అ న్ని గ్రామాల నుంచి భారీగా మండల కేంద్రాని కి చేరుకొని, అక్కడి నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి తరలివెళ్లి మంత్రి నిరంజన్రెడ్డి సభకు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోదండం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు అనురాధ, సింగిల్ విండో వైస్చైర్మన్ రాములు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురంలో..
రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి ఖిల్లాఘణపురం మండలం నుంచి ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీని చేపట్టారు. తరలివెళ్లిన వారిలో నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతబంధు సమితి నాయకులు, రైతులు, కార్యకర్తలు ఉన్నారు.
పెద్దమందడిలో..
రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం వనపర్తిలో నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీకి రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో నాయకులతో కలి సి ట్రాక్టర్ ర్యాలీని చేపట్టారు. ముందుగా మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి నాయకులు, నా యకులు ట్రాక్టర్లతో మండల కేంద్రానికి చేరుకొని అక్కడి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు, సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు శ్రీ నివాస్రెడ్డి, సత్యారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మా జీ ఎంపీపీలు మన్యపురెడ్డి, దయాకర్ ఉన్నారు.
పాన్గల్లో..
ఏరాష్ట్రంలో లేనివిధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజుగా చేయాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదిక భవనంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వినూత్నంగా అలోచన ఫలితంగా అమలులోకి వ చ్చిన రైతుబంధు ఎనిమిది విడుతలుగా అందిస్తూ ప్రస్తు తం రూ.50వేల కోట్ల మైలు రాయికి చేరుకున్నదని స్పష్టం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో రైతుబంధు మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రా ముయాదవ్, సర్పంచులు గోపాల్రెడ్డి, బాలస్వామి, నా యకులు చంద్రశేఖర్నాయక్, ఎంఈవో లక్ష్మణ్నాయక్, ఏపీఎం మద్దిలేటి, ఐకేపీ సీసీలు స్వామి, నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో..
వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రైతుబంధు సంబురాలకు పెబ్బేరు మండలం నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, రైతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల నుంచి ఎంతో ఉత్సాహంగా, ఊరేగింపులు నిర్వహించి వనపర్తి సభ విజయవంతానికి తరలివెళ్లారు. పెబ్బేరు మండల కేంద్రంలో రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పద్మ మాట్లాడుతూ రైతుబంధు సంబురాలతో రాష్ట్రంలో సంక్రాంతి వారం రోజుల ముందే వచ్చినట్లుందన్నారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నదని పేర్కొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యంయాదవ్, నాయకులు పాల్గొన్నారు.
రేవల్లిలో..
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచన మేరకు రేవల్లిలో రైతుబంధు సంబురాలను మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై ర్యాలీగా రేవల్లికి చేరుకొని ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రఘురామారావు, నారాయణరెడ్డి, కుర్మతిరెడ్డి, సురేశ్, రామారావు, లక్ష్మి, జ్యోతిశ్రీనివాస్రెడ్డి, శ్రీశైలంయాదవ్, దొడ్లరాములు, వకీల్ బిచ్చిరెడ్డి, శశిరెడ్డి, స్వామిరెడ్డి, సురేంధర్రెడ్డి, నాగరాజు, తెప్ప మహేశ్వరం పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్లో..
రైతుబంధు రావడంతో మం డలంలో రైతులు ఇండ్లల్లో సంబురాలు చేసుకుంటున్నారని ఎంపీపీ గాయత్రి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎంపీపీ రైతుబంధు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్నాయక్, నాయకుడు వెంకటస్వామి, సర్పంచ్ వినీలరాణి, పృథ్వీరాజు, కురుమయ్య, మహేశ్గౌడ్ పాల్గొన్నారు.