గట్టు, జనవరి 11 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఆ తరువాత తేడా చూస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అవగతమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టంచేశారు. మండలకేంద్రంలో రైతుబంధు సంబురాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంతబజారు నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం మీదుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బండ్ల ఫ్లెక్సీలతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించారు. ఎడ్ల బండిపై ఎమ్మెల్యే ఎద్దులను తోలుతూ అందరినీ ఉత్సాహపరిచారు. కుర్వ డోళ్ల మోతతో గట్టు గ్రామ పురవీధులు మిన్నంటాయి. అనంతరం బస్టాండ్ ప్రాంగణం లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా మండలంలో 15,480 మంది రైతులకు రూ.145కోట్ల పంట పెట్టుబడిని రైతుల ఖాతాల్లో జమచేసిందని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. మండలంలోని 27 జీపీలకు సంబంధించి ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారిని పూలమాలలతో సత్కరించి పలుగు, పార, ప్రశంసాపత్రం, మెమెంటో అందజేశారు. అనంతరం రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమం లో సర్పంచ్ ధనలక్ష్మి, గద్వాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ మేకల సుమతి, ఏఈవో ఎండీ తోహిద్, టీఆర్ఎస్ నాయకులు రా మకృష్ణారెడ్డి, హన్మంతు నాయుడు, రామన్గౌడ్, అంగడీ బస్వరాజు, సత్యనారాయ ణ, కృష్ణమూర్తి, హన్మంత్రెడ్డి, ఆలూరు ఆ నంద్, రామునాయుడు, బజారి, శ్రీనాథ్, సంతోష్, వెంకటన్నగౌడ్ పాల్గొన్నారు.
కులాంతర వివాహాలకు ప్రభుత్వం చేయూత..
కులాంతర వివాహాలకు ప్రభుత్వం చేయూత నిస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహాలు చేసుకున్న రెండు జంటలు రాణి, శివశంకర్, సంధ్యారాణి, సాంబశివలకు ప్రభుత్వం తరఫున మంజూరైన ప్రోత్సాహకం ఒక్కో జంటకు రూ.2.50లక్షల బాండ్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులాంతర వివా హం చేసుకున్న వారు కుటుంబ పోషణలో ఇబ్బందులు పడుతుంటారని అటువంటి వారికి ప్రభుత్వం చేయూతనివ్వడంలో భాగంగా ప్రోత్సాహకం అందిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం అందించిన ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్వేతాప్రియదర్శిని, అధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
సింథటిక్ కబడ్డీ కోర్టు నిర్మాణానికి కృషి
జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుల కోసం సింథటిక్ కబడ్డీ కోర్టు నిర్మాణానికి కృషి చేస్తానని కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను జిల్లా కబడ్డీ అసోషియేషన్ క్రీడాకారులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ కొన్ని ఏండ్లుగా సింథటిక్ కోర్టులపై కబడ్డీ సెలక్షన్లు జరుగుతున్నాయని ఇక్కడి కబడ్డీ క్రీడాకారులకు సింథటిక్ కోర్టు లేనందు వల్ల కబడ్డీ క్రీడల్లో రాణించలేకపోతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సింథటిక్ కోర్టును తేరు మైదానంలో ఏర్పాటు చేయాలని గద్వాల ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. అం దుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నర్సింహులు, రామకృష్ణ, సుధాకర్ ఉన్నారు.