ధన్వాడ/మరికల్, జనవరి 21 : ధన్వాడ మండలంలోని మందిపల్లి, మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామాల్లోని రామాలయాల్లో ఆదివారం శ్రీరాముడి విగ్రహాలకు అభిషేకం, యజ్ఞహోమాలు, ఊరేగింపు నిర్వహించారు. సోమవారం విగ్రహాల ప్రతిష్ఠాపన ఉంటుందన్నారు. అనంతరం అన్నదానం చేశారు.
ఊటూర్, జనవరి 21 : అయోధ్యలో సో మవారం నిర్వహించే రామమందిర ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం మండలకేంద్రంలో రామభక్తులు నగర సంకీర్త న నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీరామ జయరామ జయ జయరామ నినాదంతో మా ర్మోగింది. సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు చే సిన శ్రీరామ చరిత నృత్యాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సామాజిక సమరసత విభాగ్ కన్వీనర్ నర్సింగ ప్ప, ఎంపీటీసీ హన్మంతు, వీహెచ్పీ నాయకు లు భీంరాజ్, రాములు, భాస్కర్, వెంకట్నారాయణ, కేశవరావు, నర్సింహ ఉన్నారు.
మూసాపేట, జనవరి 21 : అయోధ్యలో బా ల రాముడి విగ్రహ ప్రతిష్ఠ పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని అడ్డాకుల, మూసాపే ట మండల కేంద్రాలతోపాటు ఆయా గ్రామా ల్లో కాషాయం జెండాలతో ముస్తాబు అయ్యా యి. సోమవారం ఆయా గ్రా మాల్లోని పలు దే వాయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టెందుకు గ్రామాల పెద్దలు, ఆలయాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మ ధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటింటి జై శ్రీరాం అం టూ రాయడం, ప్రమిదాలను, జెండాలన పం పిణీ చేశారు. ప్రతి ఇంటి వద్ద సోమవారం జెం డాలు కట్టడంతోపాటు, సా యంత్రం దీపాల ను వెలిగించాలని సూచిస్తూ పంపిణీ చేశారు.
నారాయణపేట టౌన్, జనవరి 21 : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సం దర్భంగా ఆదివారం పట్టణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, వీహెచ్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. యాద్గీర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి కాషాయ ధ్వజాలతో పురవీధుల గుండా బైక్ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చిన్నారులు సీతారా మ లక్ష్మణుల వేషాధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం పట్టణంతోపాటు గ్రామాల నుంచి అయోధ్యకు వెళ్లిన 70 మంది కరసేవకులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పా లమూరు విభాగ్ కార్యవాహ రాము, సహకా ర్యవాహ ప్రభాకర్, వీహెచ్పీ నగర అధ్యక్షుడు నర్సింహులు, వెంకట్రాములు ఉన్నారు.
దామరగిద్ద, జనవరి 21 : మండంలోని ఆ లయాలను ఆదివారం భక్తులు శుద్ధి చేశారు. సోమవారం అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
జడ్చర్ల, జనవరి 21 : మండలంలోని గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, జడ్చర్ల వేంకటేశ్వరస్వామి, సకలదేవతలు, సత్యనారాయణస్వామి ఆలయాలను పూజారులు, సి బ్బంది ఆదివారం శుద్ధి చేశారు.
కోయిలకొండ, జనవరి 21 : మండల కేం ద్రంలోని ప్రసిద్ధ ఆది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రామచంద్రస్వామి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పూజారులు తెలిపారు. సోమవారం ర్యాలీ, అన్నదానం ఉంటుందన్నారు.