మహబూబ్నగర్, డిసెంబర్ 17 : పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో శనివారం కూడా కొనసాగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే అభ్యర్థులు హాజరయ్యారు. 1133 మందికిగానూ 958 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 658 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. పరీక్షలను ఎస్పీలు వెంకటేశ్వర్లు, చేతన పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు. నోడల్ ఆఫీసర్గా ఏఎస్పీ రాములు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ఏవో కృష్ణయ్య, డీపీవో సిబ్బంది, అధికారులు అభ్యర్థులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.