మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 10 : జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో శుక్రవారం రాష్ట్ర స్థా యి జూనియర్స్ నెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రా రంభమయ్యాయి. మూడు రోజులుగా కొ నసాగనున్న నెట్బాల్ పోటీలకు అంతర్ జిల్లా ల నుంచి 26 జట్లు పాల్గోనగా.. ట్రెడీషనల్, మిక్స్డ్, ఫాస్టెస్-5 బాల, బాలికల విభాగాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. చాంపియన్షిప్ పోటీలను ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, నెట్బాల్ సం ఘం అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి ప్రారంభించారు.
నెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఉమ్మడి పాలమూర్ జట్లు శుభారంభం చేశాయి. తొలిరోజు బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టు 09-01 తేడాతో వికారాబాద్పై, నాగర్కర్నూల్ 06 – 03 కామారెడ్డిపై, నాగర్కర్నూల్ 07-01 నారాయణపేట్పై విజయం సాధించాయి. బాలుర విభాగంలో మహబూబ్నగర్ జట్టు 16-01 తేడాతో పెద్దపల్లి జట్టుపై, గద్వాల 10-08 వనపర్తిపై, నారాయణపేట్ 15-01 వికారాబాద్పై, వనపర్తి 07 – 01 వరంగల్పై, మహబూబ్నగర్ 15-09 సిరిసిల్లపై గెలిచింది.