మహబూబ్నగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మా భవిష్యత్ మీ చేతుల్లోనే ఉన్నదని, మమ్మల్ని ఎన్నుకున్నది జిల్లాను బాగుచేయడానికేనని, పాలమూరు అభివృద్ధి విషయంలో ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పనిచేసి అన్ని రంగాల్లో మం దువరుసలో నిలుపుతామన్నారు. శుక్రవారం మ హబూబ్నగర్ సమీపంలోని దివిటిపల్లి ఐటీ కారిడార్లో మరో రెండు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి వచ్చాయి. ఈ కంపెనీ కార్పొరేట్ కార్యాలయాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతామన్నారు. కులం, మతం పిచ్చితో ఈప్రాంతాన్ని సర్వనాశ నం కానివ్వం.. కులం మతం ఉంటది.. మంచి చెడు ఉంటది.. దానిమీద ఆధారపడి ప్రజల జీవితాలతో చేలగాటమాడే పని చేయమని, మీ బంగా రు భవిష్యత్కు బాటలు వేస్తామని చెప్పారు.
ఎవరికీ ఊహకందనిది.. ఒక్కరు కూడా మాకు ఐటీ టవర్ కావాలే, ఐటీ కంపెనీ కావాలే అని రిప్రజంటేషన్ చేయలేదు.. సాధ్యంకానిది ఎవరూ అడగరు.. అయినా ఈప్రాంత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సాధ్యమేకాని ఐటీ టవర్ను తీసుకొచ్చామన్నారు. యువతకు భవిష్యత్ కల్పిస్తుందనే ఉద్దేశంతో ఐటీ టవర్ను ప్రారంభించి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వల్లే దివిటిపల్లి ఐటీ కారిడార్ను పూర్తి చేసుకొని కంపెనీలను ప్రారంభించుకుంటున్నామన్నారు. భవిష్యత్లో ఐటీ టవర్ ఆవరణలోనే దేశంలోనే అతిపెద్ద లీథియం బ్యాటరీ కంపెనీ రాబోతుందని..అది గనుక పూర్తయితే వేలసంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, దీంతో మహబూబ్నగర్ స్వరూపమే మారిపోతుందన్నారు. ఐటీ టవర్లోని ఐటీ కంపెనీల్లో ఇం జినీరింగ్ చదువుకున్న విద్యార్థులు కష్టపడి టాలెంట్తో జాబ్లు సంపాదించుకొని ఇక్కడే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉద్యోగం చేసే విధంగా తీర్చిదిద్దమ ని వివరించారు.
పాలమూరు బిడ్డ కంపెనీ పెట్టాడు
ఐటీ టవర్లో జువేన్ టెక్నాలజీ కంపెనీ అధినేత మహబూబ్నగర్ బిడ్డ ఇక్కడ చదువుకొని అమెరికాలో పెద్ద కంపెనీ స్థాపించి.. ఇక్కడ ఐటీ టవర్ వచ్చాక ఎందుకు కంపెనీ పెట్టరాదని భా వించి ఇక్కడ ఐటీ కంపెనీ బ్రాంచ్ను పెట్టిన ప్రవీణ్కుమార్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఐటీ టవర్లో జువేన్ టెక్నాలజీ, అర్బన్టెక్ అనే సంస్థలు కంపెనీలు ప్రారంభయయ్యాయన్నారు. వరల్డ్ వైడ్గా ఇక్కడ నుంచే పనిచేసే విధంగా ఈ కంపెనీ వందమంది ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. పాలమూరు అంటే వలస జిల్లా అనే పేరును తుడిచి పెట్టాలని, జిల్లా విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో సుమారు నాలుగువందల ఎకరాల్లో ఐటీ టవర్ను ప్రారంభించుకున్నామన్నారు. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాయన్నారు.
మహబూనగర్ పక్కనే కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు నిర్మించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారని జిల్లా సస్యశ్యామలం అవుతుందని గుర్తు చేశా రు. ఇయ్యాల ఐటీ టవర్ రావడం వల్ల భవిష్యత్లో చుట్టు పక్కల గ్రామాల్లోని యువతకు గ్యారెంటీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రెండు కంపెనీలు వస్తేనే 11వేల ఉద్యోగాలు వచ్చాయని, భవిష్యత్లో 25 వేలమంది కుటుంబాలకు ఆసరా లభిస్తుందన్నారు. అభివృద్ధిని ఎవరైతే ఆస్వాదిస్తారో ప్రజలు వారి వెంటే ఉండాలి.. అప్పుడే పాలమూరు దశదిశ మారుతుందని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ము న్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, అధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అండ
పాలమూరు, సెప్టెంబర్ 8 : తెలంగాణలో మా త్రమే దివ్యాంగులకు రూ.4016 పింఛన్ సీఎం కేసీఆర్ అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించి వారికి అండగా నిలుస్తున్నదని చెప్పా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అలీమ్ కో వారి ఆధ్వర్యంలో 425 మంది ది వ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాలను మం త్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం సదరం క్యాంపులు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి దివ్యాంగులకు పర్మినెంట్ డిజేబుల్ సర్టిఫికెట్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీఈవో రవీందర్, సీఎంవోలు బాలుయాదవ్, శ్రీనివాసులు, ఎంఈవో మంజులాదేవి, కౌన్సిలర్లు కిశోర్, రాంలక్ష్మణ్, వెంకటేశ్ ఉన్నారు.