మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26 : సర్కారు దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ యంత్రాన్ని శనివారం హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో రూ.3వేలు వెచ్చించి టిఫా స్కానింగ్ చేయించుకునే పరిస్థితి ఉండేదన్నారు.
సర్కారు దవాఖానల్లో పేదలకు ఉచితంగా టిఫా స్కానింగ్ సేవలు అందించాలని ము ఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో రూ.50కో ట్లు వెచ్చించి అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సర్కారు వైద్యసేవలను పేదలు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. మాతాశిశు సంరక్షణ భవనంలో గర్భిణులకు టిఫా స్కానింగ్ పరీక్షలను ప్రారంభించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో శశికాంత్, గైనిక్ హెచ్వోడీ రాధ, రేడియాలజి స్టు హనుమంత్ ప్రసాద్, వైద్యాధికారులు రఫీక్, భాస్కర్రావు, ఆర్ఎంవోలు సిరాజ్, ప్రసన్న, కీర్తి తదితరులు పాల్గొన్నారు.