పాలమూరు, ఫిబ్రవరి 24 : ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా.. గోవింద అంటూ భక్తుల నామస్మరణతో మన్యంకొండ గిరులు మార్మోగాయి. మహబూబ్నగర్ రూరల్ మండలంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం ఆచరించి భక్తిశ్రద్ధలతో దాసంగాలు పెట్టారు. అనంత రం స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఆ లయ ధర్మకర్త మధుసూదన్కుమార్ అభిషేకం, విశేష అలంకరణ చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని నిర్వాహకులు విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. ప్రధాన ఘట్టమైన రథోత్సవం (తేరు) సందర్భంగా ఆలయానికి తెలుగు రాష్ర్టాల నుంచి భక్తులు ఎద్దులబండ్లపై భారీగా తరలివస్తున్నారు. కొండ కింద ముఖద్వారం వద్ద జాతర దు కాణాలు వెలియడంతో చిన్నారులు, పెద్దలు వివిధ రకాలు వస్తువులు, తినుబండారాలను కొనుగోలు చేస్తున్నారు. భక్తులు వేల సంఖ్యలో తరలిరావడం తో ఆలయ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకున్నది. భక్తులకు వేంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆల య ఈవో శ్రీనివాసరాజు, పర్యవేక్షకులు నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండకు ప్రత్యేక బస్సులు..
మన్యంకొండ జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు మహబూబ్నగర్ ఆర్ఎం శ్రీదేవి తెలిపా రు. శనివారం జాతరలో ప్రత్యేక బస్టాండ్ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్టాండ్ నుంచి కొండపైకి వెళ్లేందుకు మినీ పల్లెవెలుగు బస్సులు నడుపుతున్నామన్నారు. ఆమె వెం ట డీఎం సుజాత ఉన్నారు.
రెడ్క్రాస్ ఆధ్వర్యంలో సేవలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు అందించడంతోపాటు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, ఎన్టీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, యూత్ కోర్డినేటర్ రాజేశ్వరి, రెడ్క్రాస్ కోఆర్డినేటర్ బాబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.