గద్వాల, మే 24 : జిల్లా కేంద్రంలో 20సంవత్సరాలుగా దంతవైద్యుడు డాక్టర్ మహేశ్ దంత సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని ఎమ్మె ల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మహేశ్ దంత వైద్యశాల 21వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో ఉచిత శిక్షణ పొందుతున్న చి న్నారుల కోసం ఏర్పాటు చేసిన దంతవైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కా లంలో బాలభవన్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్లో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మహేశ్కు సూచించారు. అనంతరం బాలభవన్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా టూత్బ్రష్ లు, పేస్టులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్లు మహేశ్, నరహరి శ్రీనివాసు లు, శ్రీనివాసులు, కృష్ణ పాల్గొన్నారు.
మార్కెట్ పనులు పరిశీలన
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే బండ్ల పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ కేశవ్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్లు ముర ళి, టీఆర్ఎస్ నాయకులు నాగన్న, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.