నాగర్కర్నూల్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : నులి పురుగులు.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. పోషకాహార స్థితిని బలహీనం చేసే ఈ పురుగులతో శక్తిహీనులుగా మారుతారు. దీంతో శరీరంలో ప్రొటీ న్లు, ఇనుము నశించి పిల్లలకు తరచూ రక్తహీనత ఏర్పడుతుంది. ఫలితంగా పిల్లలకు అందాల్సిన పోషకాలను పీల్చేసి, శరీరం గ్రహించే శక్తిని కూడా తగ్గిస్తాయి. విటమిన్-ఏ ను అందకుండా చేస్తా యి. ఏ ఆహారం తీసుకున్నా ఈ పురుగులే తినేస్తాయి. ఇవి పేగుల్లో పోషకాలను గ్రహించి గుడ్లు, లార్వాలుగా వృద్ధి చెందుతాయి.
దీంతో ఆకలి మందగించడం, శారీరక ధృఢత్వం తగ్గుతుంది. నులి పురుగులు సోకిన పిల్లలు బక్కగా, మందబుద్ధులుగా మారుతారు. కడుపు నొప్పి, వాంతులు, అతిసార, మలంలో రక్తం, వికారం వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. ఈ నులి పురుగులకు ప్ర ధాన కారణం.. అపరిశుభ్రతగా వైద్యులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని పిల్లలకు నులి పురుగుల సమస్య అధికంగా వస్తుంది. పిల్లలు తమ చేతి గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లు పెరిగితే వెంటనే కత్తిరించుకోవాలి. లేకుంటే గోళ్లల్లో పేరుకుపోయిన మట్టి ద్వారా నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
అదే విధంగా కలుషిత నీరు, బహిరంగ మల విసర్జన కూడా నులి పురుగులు శరీరంలోకి ప్రవేశించేందుకు కారణాలుగా మారుతున్నాయి. కూరగాయలను శుభ్రంగా కడగకుండా వంటలు చేయడం, వండిన ఆహారంపై మూతలు పెట్టకపోవడంతో నులి పురుగులు వృద్ధి చెందుతాయి. ఈ నులి పురుగులు నిర్మూలించాలంటే ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. నులి పురుగులు ఉంటే మాత్రలు వేసుకున్న ఒకట్రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వెళ్తాయి. దీన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్ర భుత్వం 2005 నుంచి ఏడాదిలో ఏదైనా ఒకరోజును జాతీయ నులి పురుగుల దినోత్సవంగా ని ర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా గురువారం ఏ డాది నుంచి 19 ఏండ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 1 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలకు 200, 2 నుంచి 3 ఏండ్లలోపు పిల్లలు, 3 నుంచి 19 ఏం డ్లలోపు పిల్లలు 400 మిల్లీగ్రాముల మాత్రలు వే సుకోవాలి. ఈ మాత్రలను భోజనం తర్వాత వేసుకొని బాగా నమలాలి. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆ ధ్వర్యంలో గ్రామస్థాయిలోనూ మాత్రల పంపిణీని చేపట్టననున్నారు.
ఆయా గ్రామాలు, పురపాలికల్లోని ప్రతి విద్యా సంస్థల్లో ఉచితంగా మాత్రలను అందజేస్తారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి పర్యవేక్షణలో ఆశకార్యకర్తలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలకు విధులు కేటాయించారు. ఈ ఒక్కరోజే పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను అందించే ఏర్పాట్లు చేశారు. మిగిలిన పిల్లలకు ఈనెల 22న మరోసారి అందించనున్నారు.
జిల్లాలో 1 నుంచి 2 ఏండ్లలోపు పిల్లలు 13,451, 2 నుంచి 3 ఏండ్లలోపు పిల్లలు 12,419, 3-19 ఏండ్లలోపు పిల్లలు 1,82,736 మంది ఉన్నారు. వీరందరికకీ గురువారం ఆల్బెండజోల్ మాత్రలను అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ఆశలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలందరికీ తమ గ్రామాల పరిధిలో గుర్తించిన పిల్లల వివరాలు అందించాం. నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తే శారీరకంగా ఎదగరు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా మాత్రలను వేయించాలి.
– డాక్టర్ రవినాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, నాగర్కర్నూల్