నేరుగా మీ ఇంటికే వస్తా.. చర్చిద్దాం
పార్టీ నాయకులను మంత్రి కేటీఆర్ కలవడం ఆనవాయితీ
అంబేద్కర్ విగ్రహం వద్ద నీ నీచ చరిత్ర చెప్పకు..
కూలంకషంగా చర్చిద్దాం
మాజీ మంత్రి జూపల్లికి ఎమ్మెల్యే బీరం సవాల్
కొల్లాపూర్ రూరల్, జూన్ 20 : సీఎం కే సీఆర్ ఆశీర్వాదంతో కొల్లాపూర్ సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నదని, నీ ఇంటికే వస్తా.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం మండలంలోని అం కిరావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకు డు అయ్యపురెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అనేది ప్రభుత్వ పరంగానే జరుగుతుందని.. ఎక్కు వ నిధులు తీసుకురావడంలో మాత్రం వ్య క్తుల ప్రయత్నం ఉంటుందన్నారు. తాను ఎ మ్మెల్యే గెలిచిన తరువాత కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానన్నారు. సింగోటం-గోపల్దిన్నె లింక్ కెనా ల్, సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, మామిడి ప్రాసెసింగ్ యూనిట్, కొల్లాపూర్-అచ్చంపేటకు బస్సు రూట్ కల్పించేలా నడివాగుపై వంతెన, కోడేరు, పాన్గల్ మండలాల్లో రో డ్డు విస్తరణ పనులు.. ఇలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో పరిష్కరించామన్నారు. త్వరలోనే జాతీయ రహదారి టెం డర్లు పూర్తి చేసి.. పనులు ప్రారంభిస్తామన్నారు. సింగోటం లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆధునీకరణ పనులు త్వరలోనే చేపడుతామన్నారు.
జూపల్లి కృష్ణారావును మం త్రి కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారని, అందులో వింత ఏముందన్నారు. ఖ మ్మంలో కూడా ఒక నాయకుడిని మంత్రి కేటీఆర్ కలిశాడని, పార్టీకి సంబంధించిన వ్య క్తులు, నాయకులను కలవడం ఆనవాయితీ అని తెలిపారు. జూపల్లి అసలు ఏ పార్టీకి చెం దిన వ్యక్తో తేల్చి చెప్పాలన్నారు. ఈ నెల 26 న అంబేద్కర్ విగ్రహం ఎదుట కూర్చొని నీ నీచ చరిత్ర చెబితే.. ఆ పవిత్ర స్థలం అపవి త్రం అవుతుందన్నారు.
‘అక్కడ.. ఇక్కడ ఎందుకు.. నేరుగా నీ ఇంటికే వస్తా.. బహిరంగ చర్చకు సిద్ధమా’ అని జూపల్లికి ఎమ్మె ల్యే బీరం సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉ న్న సమయంలో నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు, ఇద్దరు గన్మెన్లు చంపబడిన సమయంలో అక్కడే ఉన్న నీ వద్దకు దుండగులు ఎందుకు రాలేదని ప్రశించారు. నీవు బ్యాంక్లో పనిచేసే సమయంలో జరిగిన సం ఘటనలు ఇలాంటి అన్ని విషయాలపై కూలంకషంగా చర్చిద్దామన్నారు. సోషల్ మీడియా వేదికగా అబద్ద్ధాలతో కాలం వెల్లదీస్తూ అనవసర రాద్ధ్దాంతం చేస్తున్నాడన్నా రు. డీ-5 కాలువను పూడ్చారని గగ్గోలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే చూస్తున్నావని, వాస్తవంగా పనులు జరుగుతున్న ఏజె న్సీ ఎక్కడుంది.. గగ్గోలు పెట్టిన పనులు ఎక్కడున్నాయో కూడా తెలియదా అని విమర్శించారు సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, ఎంపీపీ భోజ్యానాయక్, విండో చైర్మన్లు కృష్ణయ్య, రాజేందర్గౌడ్, జగన్మోహన్రెడ్డి, డైరెక్టర్ పరశురాంగౌడ్, నాయకులు జంబులయ్య, కమలేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కేశవులు, గాలియాదవ్ తదితరులు పాల్గొన్నారు.