మహబూబ్నగర్ అర్బన్, మే 30 : అమెరికాలోని డాలస్ రాష్ట్రంలో ఎన్ఆర్ఐ నేతలు శుక్రవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం డాలస్లోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన కారు ర్యాలీలో అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1న డాలస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలకు తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు అందరూ హాజరు కావాలని పి లుపునిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం ఎం తో అవసరమని కోరారు. కార్యక్రమంలో ఎ న్ఆర్ఐ నాయకులు పాల్గొన్నారు.