ఉండవెల్లి, మార్చి 14 : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని గెలిపించి పార్టీ రుణం తీర్చుకోవాలని మా జీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్రెడ్డి.. నవీన్కుమార్రెడ్డిని పరిచయం చేశారు.
అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ నవీన్కుమార్రెడ్డి గతంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ వైస్చైర్మన్గా పనిచేశారన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు తెలిసిన వ్యక్తిని శాసనమండలికి పంపితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నా రు. ఉమ్మడి జిల్లాలో 1,439 మంది ఓటర్లు ఉండగా.. అందులో 880 మంది బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక ఏకపక్షం ఉండడంతో ప్రజాస్వామ్యయుతంగా గెలుపొందలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీకి సిద్ధం అవుతున్నారన్నారు. వారి కుయుక్తలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తిప్పికొట్టాలన్నారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ ప్రలోభాలకు గురికాకుండా నవీన్కుమార్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వనపర్తి, మార్చి 14 : ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్రెడ్డిని గెలిపించుకొని పార్టీ ప్రతిష్టను మరింత పెంచుదామని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కలిసికట్టుగా నవీన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నా రు. బీఆర్ఎస్ విజయం పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండే పార్టీ అభ్యర్థులకు మరింత బలాన్ని చేకూరు స్తుందన్నారు.
అనంతరం నవీన్ మాట్లాడుతూ ప్రజ ల కోసం నిరంతరం పాటు పడుతానన్నారు. స్థానిక సంస్థల హక్కుల కోసం పోరాడుతానని, మీరంతా సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. త నపై నమ్మకం ఉంచి టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఉమ్మడి బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్తోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.