భూత్పూర్, జనవరి 11 : ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. భూత్పూర్ రైతువేదికలో బుధవారం కంటివెలుగుపై నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈనెల 18నుంచి జూన్ 14వరకు కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గ్రామాలకు వచ్చే అధికారులకు సహకరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాకు 46వేల కంటి అద్దా లు వచ్చినట్లు తెలిపారు.
కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. భూత్పూర్ రైతువేదికలో మూసాపేట మండలానికి చెందిన 23మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని తెలిపారు. అనంతరం భూత్పూర్ మండలానికి చెందిన 11మందికి రూ.3, 70,500, మూసాపేట మండలానికి చెంది న ఐదుగురికి రూ.లక్షా 29వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎంపీపీలు కదిరె శేఖర్రెడ్డి, కళావతి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సాయిబాబా, ప్రోగ్రాం ఆఫీసర్ సం ద్యాకిరణ్మయి, తాసిల్దార్లు చెన్నకిష్టన్న, మం జుల, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మత్స్య సహకార సం ఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ టీచర్స్ యూనియన్ రూపొందించిన క్యాలెండర్ను భూత్పూర్ రైతువేదికలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చై ర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీటీయూ జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ, ప్రధానకార్యదర్శి గుడిసె యాదయ్య, నాయకులు జనార్దన్రెడ్డి, నిరంజన్, హనుమంతు, సూర్యకుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.