మూసాపేట(అడ్డాకుల), జనవరి 13: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లబ్ధిపొందిన ప్రతిఒక్కరూ సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. అడ్డాకుల మండలం గుడిబండలో శుక్రవారం ముదిరాజ్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామానికి మంజూరైన బీటీరోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్ డీఈ రామకృష్ణను ఆదేశించారు. గ్రామంలో 80 డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రామచంద్రాపురంలో రూ.కోటితో బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఆలకు బైక్ ర్యాలీ, మహిళలు మంగళహారతులతో స్వాగతం ఫలికారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశనగలో అధిక ఉత్పత్తిపై ఎమ్మెల్యే ఆలతో పాటు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గిరిజన ఉప ప్రణాళిక పథకం సహకారంతో 50మంది గిరిజన రైతులకు ఎరువులు, పురుగుల మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే 38మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, రైతుబీమా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను గుర్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, తాసిల్దార్ కిషన్, ఎంపీడీవో మంజుల, ఏవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జితేందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మహమూద్, రమేశ్గౌడ్, సర్పంచులు భాస్కర్నాయుడు, కృష్ణారెడ్డి, జయన్నగౌడ్, శ్రీకాంత్, ఆంజనేయులు, కిషన్, కల్పన, ఎంపీటీసీలు రంగన్నగౌడ్, శకుంతల, చంద్రయ్య, కోఆఫ్షన్ సభ్యుడు ఖాజాగోరి, శ్రీనివాసులు బీఆర్ఎస్ నాయకులు, ఉద్యకారులు తదితరులు పాల్గొన్నారు.