ఆమనగల్లు, ఏప్రిల్ 20 : కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అ న్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీతో కలిసి నిరంజన్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల పాలనలో తెలంగాణ, ఏపీ, పంజాబ్, హర్యాన, తమిళనాడుతోపాటు పలు రాష్ర్టా లు అభివృద్ధి చెందాయన్నారు. అదే జాతీయ పార్టీ ల పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ వంటి రాష్ర్టాలు ఎందుకు వెనుకబడి పోయాయని ప్రశ్నించారు. గతంలోని పీఎంలు మీడియా సమావేశంలో దేశానికి చేసిన అభివృద్ధి, ఇతర అంశాలను తెలియజేసేవారని, కానీ మోదీ వచ్చి పదేండ్లు అ యినా జాతీయ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకొ ని ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ రెండు పార్టీలను నమ్ముకొంటే నట్టేట ముంచుతాయని హెచ్చరించారు. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. అనంతరం ఆర్ఎస్పీ మాట్లాడుతూ మీ ప్రాంత బిడ్డగా ఎన్నికల బరిలో నిలిచానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఎందరో పేద విద్యార్థుల భవితకు బాటలు వేశానని చెప్పుకొచ్చారు. తాను గెలిస్తే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్లో చేరితే టీఎస్పీఎస్సీ పదవి ఇస్తానని సీఎం రేవంత్ ఆశ చూపారని, తాను ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చూసి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. సమావేశంలో పుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి రంగినేని అభిలాష్రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.