నాగర్కర్నూల్, డిసెంబర్ 1 : విద్యార్థులు పట్టుదలతో చది వి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇందుకుగానూ తన వం తు సహకారం అందిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ఫ్లవర్ హైస్కూల్లో మూడు రోజులపాటు నిర్వహించిన జిల్లాస్థాయి రాష్ట్రీయ బాల విజ్ఞాన ప్రదర్శన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ వయస్సులో చిన్నవారైనా తమ ఆవిష్కరణలతో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ప్రజలను ఆలోచింపజేసేలా, ఉపయోగపడేలా ప్రదర్శనలు ఉండాలన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని.. రైతుల కోసం సులువైన యాంత్రిక పరికరాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హైదరాబాద్లోని టీ-హబ్కు తీసుకువెళ్తానని ప్రకటించారు. అలాగే విజేతలకు రూ.2 వేల పారితోషికం, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ తన మిత్రుడు 2011లో ఆవిష్కరించిన లాజిస్టిక్ కంపెనీ జీపీఎస్ ఆవిష్కరణకు వచ్చిన ఆదరణను విద్యార్థులకు ఉదహరించారు. ఆ ఆవిష్కరణను లక్ష డాలర్లతో కొనుగోలు చేశారన్నారు.
డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ ఏడు అంశాలపై 230 పాఠశాలల నుంచి 486 ప్రదర్శనలు వచ్చాయ న్నారు. వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థులు 37 ప్రదర్శనలు ఇ చ్చారన్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విభాగాల ఉత్తమ ప్ర దర్శనలకు విప్ గువ్వల బహుమతులు అందజేశారు. విద్యార్థిను ల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నోడల్ అధికారి కుర్మయ్య, రాజశేఖర్రావు, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్లుశెట్టి, ఎస్పీఏసీ ప్రసాద్గౌడ్, వెంకట య్య, తీస్కుమార్, వెంకటయ్య, సూర్య చైతన్య, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.