గృహమే కదా స్వర్గసీమ అన్నాడో సినీ కవి.. అందమైన ఇళ్లు కట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది.. అయితే ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. అందుకే అందమైన పొదరిల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తున్నారో.. డిజైన్కూ అంతకంటే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వారు సరికొత్తగాఇంటీరియర్ డెకరేషన్కే ప్రాధాన్యమిస్తున్నారు. బయటి ఎలివేషన్ నుంచి మొదలు ఇంటీరియర్ ఎంపికలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పాల్ సీలింగ్, కప్బోర్డులు, ఎలివేషన్, మెట్లు, బాల్కనీలు, స్టీల్ రెయిలింగ్కు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి లోపలి గోడలకు లప్పం వేయించడంతోపాటు డబ్ల్యూపీవీసీ తలుపులు, యూపీవీసీ కిటికీలు అమర్చుతున్నారు. కప్ బోర్డులతో వంట గదులు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
– కల్వకుర్తి, మార్చి 4
కల్వకుర్తి, మార్చి 4 : ‘గృహమే కదా స్వర్గసీమ’ అని ఓ సినీ కవి వర్ణించిన ట్లు.. పల్లెల్లో కూడా గృహాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. పెద్ద పెద్ద ఇండ్లు, పాలరాతి బండలు, కప్బోర్డులు, ఇండ్ల మధ్యలో మెట్లు.. ఇలా పట్టణా ల్లో చాలా విలాసవంతంగా కనిపించేవి. సినిమాలు, టీవీల్లో కనిపించే ఇండ్లను చూసి అబ్బో అనుకునేవాళ్లం. ఇప్పుడు కాలం మారిం ది. రెండు గదుల ఇండ్లు ఉంటే చాలనుకునే కాలం నుంచి సకల వసతులు ఉండేలా నిర్మించుకునే స్థాయికి గ్రామీణ ప్రాంతాలూ చేరుకున్నాయి. ఇల్లు ఒకేసారి కట్టుకుంటాం కదా.. మంచిగా ఉండాలి అనే రీతిలో ఆలోచిస్తున్నారు. ఇల్లు అం దంగా కనిపించేందుకు ఇంటీరియర్, ఎలివేషన్పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటి నిర్మాణం కంటే ఇంటీరియర్కే ఎక్కువ ఖర్చు వెచ్చిస్తున్నారు. గోడలు అం దంగా ఉండాలనే ఉద్దేశంతో లప్పం వేయిస్తున్నారు. లప్పం గోడలకు రంగులు వేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇండ్లకు లప్పం పని పెరగడంతో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి కార్మికులు వచ్చి ఉపాధి పొందుతున్నారు.
ఆకర్షణీయంగా ఉండేలా..
ఇంటి కప్పునకు ఎక్కువమంది పాల్ సీలింగ్ ఏర్పాటు చేయించుకుంటున్నారు. రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్న క్రమంలో పల్లెవాసులు కూడా దీనిపై మక్కువ చూపిస్తున్నారు. జిప్సం ప్లేట్లే కాకుండా యూపీవీసీ ప్లేట్లను కూడా పాల్ సీలింగ్కు వాడుతున్నారు. పాల్సీలింగ్ వల్ల వేసవిలో చల్లగా ఉంటుందని, పైకప్పు విద్యుత్ బల్బులతో అందంగా ఉంటుందని గృహ యజమానులు భావిస్తున్నారు. అలాగే, గతంలో తాండూర్ బండలు ఫ్లోరింగ్ వేస్తే చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు వా టిని పార్కింగ్ కోసం వాడుతున్నారు. ఇంటి లోపల మాత్రం మార్బుల్స్, గ్రానైట్, టైల్స్ వేస్తున్నారు. ప్లోరింగ్కు కూడా పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నారు. పిట్టగోడ, మెట్లు, బాల్కానీలకు స్టీల్ రెయిలింగ్లు ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో చాలా డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి కప్ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్టలు, ఇతర వస్తువులు భద్రపరుచుకునేందుకు చాలా మంది వీటిని ప్రెఫర్ చేస్తున్నారు. ఇంటి ని ర్మాణాలకు అవసరమైన మెటీరియల్ అంతా పట్టణాల్లో ల భిస్తుండడంతో గృహ యజమానులకు ఇబ్బంది లేదు.
తగ్గిన కలప వినియోగం..
గతంలో ఇల్లు నిర్మించుకోవాలంటే కలప చా లా అవసరం ఉండేది. చౌకట్లు, తలుపులు, కి టీకీలు ఇలా అన్నింటికీ వినియోగించేవారు. వేప, తుమ్మ, ఆర్థికంగా ఉన్నవారైతే టేకు వాడేవారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్ మారింది. కలపకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నా రు. మెయిన్ డోర్ మాత్రం టేకు లేదా నాణ్యమైన వేప కలపను వా డుతూ మిగతా వాటికి డబ్ల్యూపీవీసీ తలుపులు, యూపీవీసీ కిటికీలను ఉపయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించి చాలా కంపెనీలు ఉండగా, ఆర్డర్ ఇస్తే కంపెనీ సిబ్బంది ఇంటికి వచ్చి అమరుస్తున్నారు.
ఇంటీరియర్పైనే ఎక్కువ ఆసక్తి..
ఇల్లు ఉండడానికి అనేది ప్రస్తుత కాలంలో ఎవ్వరూ ఆలోచించడం లేదు. అందంగా, అన్ని వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. డబ్బులు ఎక్కువైనా వెనుకడుగు వేయడం లేదు. కలప వినియోగం తగ్గడంతో ఆర్థిక భారం లేకుండా పోయింది. కలపకు బదులు డబ్యూపీవీసీ, యూపీవీసీ వంటివి విరివిగా అందుబాటులోకి వచ్చాయి. గృహయజమానులు ఇంటీరియర్పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇంటి కన్నా ఇంటీరియర్కే ఎక్కువ ఖర్చు అవుతున్నది.
– బైరి కరుణాకర్రెడ్డి, బిల్డర్, కల్వకుర్తి