అలంపూర్, మార్చి 13 : రెండ్రోజుల్లో నెట్టెంపాడు లింక్తో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు, అలాగే బుధవారం తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సాగునీరు అందనున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. సోమవారం ఏపీలోని కర్నూల్ జిల్లా ఇరిగేషన్ ఎస్సీ శేఖర్రెడ్డితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి అంశంపై చర్చించారు. సోమవారం నుంచి కర్నూల్ కేసీ కెనాల్కు వెళ్లే నీటి ఇండెంట్ను తగ్గిస్తామని అక్కడి ఎస్సీ శేఖర్రెడ్డి చెప్పారని ఎమ్మెల్యే వివరించారు.
ఎగువ ప్రాంతం నుంచి 400 క్యూసెక్కుల ఇం డెంట్ పెట్టామని తెలిపారు. అలాగే పీజేపీ ఎస్సీతో ఫోన్లో ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడగా.. జూరాల ప్రాజెక్టు నుంచి 152 క్యూసెక్కుల ఇండెంట్తో ఆర్డీఎస్ లింక్ కెనాల్కు వస్తున్నట్లు తెలిపారని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. సమావేశంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి, జెడ్పీటీసీ కాశపోగు రాజు, జూలేకల్ ఎంపీటీసీ రవిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శీనుగౌడ్, రవిప్రకాశ్రెడ్డి, మోహన్ పాల్గొన్నారు.