ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమాప్తం
పోలింగ్కు చురుగ్గా ఏర్పాట్లు
నేడు జంబో బాక్స్ల తరలింపు
9 రకాల గుర్తింపు కార్డులతో ఓటెయ్యొచ్చు
మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ శాసనమండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఇందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా జంబో బ్యాలెట్ బాక్స్లు వినియోగిస్తున్నారు. మొత్తం 799 పోలింగ్ కేంద్రాలకు గానూ ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు చొప్పున 1598 బాలెట్బాక్స్లు.. అదనంగా 324 బాక్స్లను సిద్ధం చేశారు. చాదర్ఘాట్ విక్టరీ గ్రౌండ్లో నిల్వ ఉంచిన ఈ బాక్స్లను శనివారం జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు