భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
కొత్తకోట, నవంబర్18: బతుకుదెరువుకు వచ్చి ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం గద్వాల పట్టణానికి చెందిన వెంకట్రాములునాయక్, రాధ(48)దంపతులు 15 రోజుల కిందట కడుకుంట్ల స్టేజీ సమీపంలో దాబా ను అద్దెకు తీసుకున్నారు. దాబాకు కావాల్సిన మరమ్మతు పనులు పూర్తి చేసుకొని శనివా రం దాబాను ప్రారంభించేందుకు సామగ్రి కోసం కొత్తకోటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కంటైనర్ వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. రాధ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రాములునాయక్ను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.