న్యూఢిల్లీ: పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలాకు ‘వై’ క్యాటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో ఆయనకు రక్షణ ఉంటుందన్నది. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ను ఎస్ఐఐ తయారుచేస్తున్నది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు బెదిరింపులు వస్తున్నాయని, ఆయనకు భద్రత కల్పించాలని ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాశ్కుమార్ లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.