పాలకుర్తి సోమనాథ కళాపీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక 2021-22 ద్వైవార్షిక పురస్కారాలను ప్రకటించిం ది.
సోమనాథ సాహిత్య పురస్కారానికి డాక్టర్ కానుకుర్తి శెట్టి సోమశేఖర్ (మహబూబ్ నగర్), సామాజిక శోధన పురస్కారానికి డాక్టర్ నలిమెల భాస్కర్ (కరీంనగర్), రంగస్థల పురస్కారానికి మంచాల రమేశ్ (కరీంనగర్), పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్వచ్ఛంద భాషా సేవ పురస్కారానికి డాక్టర్ మైథిలి అబ్బరాజు (బెంగళూరు), వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారానికి ఎం ఎస్ ఆర్ వెంకటరమణ (సామర్లకోట), ముశం దామోదర్ రా వు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కారానికి సీఎస్సార్ ప్రభు (హైదరాబాద్), డాక్టర్ రాపోలు సోమ య్య ప్రతిభా పురస్కారానికి డాక్టర్ ఆరూరి మహేందర్ (విస్నూరు), దేవగిరి రాజయ్య స్మారక బిరుదుకు బూస రేణుకారాధ్య (విశాఖపట్నం) ఎంపికయ్యారు. ఈ నెల 31న పాలకుర్తిలో పురస్కారాలను ప్రదానం చేస్తారు.
– సోమనాథ కళాపీఠం