Fashion | మార్కెట్లోని అనేకానేక దుస్తుల బ్రాండ్స్లో ‘నెసెసెరా’ (Necesera) స్థానం ప్రత్యేకం. టాప్స్ నుంచి పైజమాల వరకు ప్రతీది నాణ్యతతో తయారు చేస్తారని పేరు. ఐరోపా మాడల్స్ స్ఫూర్తితో ప్రపంచశ్రేణి దుస్తులను మన దేశంలోనూ అందించాలనే ఉద్దేశంతో సుదీక్ష, రిద్ధి జైన్ అనే అక్కా చెల్లెళ్లు స్థాపించిన సంస్థ ఇది. ఇందులో రూపొందే ప్రతి డిజైన్నూ ఆరునెలల పాటు పరీక్షించిన తర్వాతే మార్కెట్లో విడుదల చేస్తారు.
సుప్రిమా కాటన్, బాంబూ టెర్రీ లాంటి నాణ్యమైన ముడి వస్ర్తాలతో… ఈ దుస్తులను రూపొందిస్తారు. దీంతో, చర్మానికి ఇబ్బంది కలగకుండా, ఒంటి మీద సౌకర్యంగా ఉంటాయి. తయారీలో 70 శాతం తక్కువ నీరు వాడేలా జాగ్రత్తపడతారు. ‘నెసెసెరా ఓ బ్రాండ్ మాత్రమే కాదు’ అంటారు సుదీక్ష, రిద్ధి కూడబలుక్కుని. సుదీక్ష అమెరికాలో చదువుకున్నారు. ముంబైలో ఉద్యోగం వెతుక్కోడానికి ముందు కొంతకాలం ఢిల్లీలో ఉంటూ కుటుంబ వస్త్ర వ్యాపారం చూసుకున్నారు. మార్కెట్లో వైవిధ్యం చాలా తక్కువగా ఉందని అర్థమైపోయింది. దీంతో తోబుట్టువు రిద్ధితో కలిసి వ్యాపారం ప్రారంభించారు. ఘన విజయం సాధించారు.