ఎరుపులో మెరుపు ఉందో.. ఆమెలోని మెరుపు కారణంగా ఎరుపు రంగుకు కొత్త మెరుపు వచ్చిందో తెలియదు కానీ.. ‘కల్యాణం కమనీయం’ కథానాయిక ప్రియా భవానీశంకర్ ఎర్రని ఆర్గంజా చీరలో నిలువెత్తు కెంపులా కళకళలాడుతున్నది. ముత్యాల జుంకాలు, ఉంగరాలు.. కొత్త సింగారాన్ని అద్దాయి. వెండివన్నె నెయిల్పాలిష్.. ప్రియ ఒంటిరంగుకు కొత్త హంగు అద్దింది. ఈ చెన్నపట్నం చిన్నది ఎంబీయే చదివింది. దాంతోపాటే, మాస్టర్ ఆఫ్ బ్యూటీ మేనేజ్మెంట్ పట్టా కూడా అందుకుందేమో!
-సి.ఎం. ప్రవీణ్