జీ తెలుగు ‘సరిగమప’.. సినీ పాటల లోకానికి ఎంతోమంది కొత్త గాయకులను పరిచయం చేసింది. తాజాగా, ‘సరిగమప ఛాంపియన్షిప్’ పేరిట ప్రారంభం కానున్న కొత్త సీజన్లో.. ఇప్పటివరకు జరిగిన సీజన్లలోని విజేతలు, అత్యుత్తమ కంటెస్టెంట్లు పోటీ పడనున్నారు. అంటే, మునుపటి నాలుగు సీజన్ల జట్లూ సై అంటే సై అంటాయి. మొత్తం 24 మంది గాయకులు ఒక్కో జట్టుకు ఆరుగురు చొప్పున తలపడతారు. ప్రతి జట్టుకూ ఒక మెంటర్ నాయకత్వం వహిస్తారు.
మనో, శైలజ, అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ, సాకేత్, పృథ్వీచంద్ర, రమ్య బెహరా మెంటర్లు. ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాత. ఈ కార్యక్రమం జనవరి 29 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ మధ్యే దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ విడుదల చేశారు.