ప్రియా అహూజా.. 4 నిమిషాల 26 సెకన్లపాటు యోగాసనాల్లోనే అతి కష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. హరిద్వార్కు చెందిన ప్రియ కాలేజీ రోజుల్లో ఫిజియోథెరపీ మీద అభిమానం పెంచుకుంది. యోగా నేర్చుకుంది. ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్టుగా మారింది. సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అవతారమూ ఎత్తింది. సొంతంగా స్పర్శ్ క్లినిక్ పేరుతో ఫిజియోథెరపీ, యోగా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించింది. మంచి పేరు సంపాదించుకుంది.
గత ఏడాది3 నిమిషాల 28 సెకన్లపాటు అత్యంత క్లిష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ ఏడాది ఆ వ్యవధిని 4 నిమిషాల 26 సెకన్లకు పెంచి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. నిజానికి అష్టవక్రాసనాన్ని అందరూ వేయలేరు. వేసినా అంతసేపు ఉండలేరు. వందలాది మందికి యోగా నేర్పడమే కాదు, పదుల సంఖ్యలో ఫిజియోథెరపిస్టులను కూడా తయారు చేస్తున్నది ప్రియ. హరిద్వార్లోని మాతా వైష్ణోదేవి ట్రస్టులో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ హెడ్గా కూడా పనిచేసింది. తన పనితనంతో ప్రధాని, కేంద్రమంత్రుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ‘చేసే పని మీద ప్రేమ పెంచుకుంటే, రికార్డులు సాధించడం గొప్ప విషయమేం కాదు’ అంటున్నది ఈ యోగా టీచర్.