హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్: రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఆక్సిజన్ సరఫరా లో జాప్యం కావొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ట్రాన్స్పోర్టు, ఆర్టీసీ అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ సమావేశం నిర్వహించారు. ఒడిశాలోని అంగూర్, కర్టాటకలోని బళ్లారి నుంచి మెడికల్ ఆక్సిజన్ రవాణాలో జాప్యాన్ని నివారించడానికి పోలీ స్ఎసార్ట్ వాహనాలతోపాటు మెకానిక్లు, ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను వినియోగించుకొని రైల్వేద్వారా ఆక్సిజన్ ట్యాంక ర్లు వచ్చేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తద్వారా అంగూర్కు ప్రయాణ సమయం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించగలుగుతామని చెప్పారు. కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించేందుకు వీలుగా ఆయా ట్యాంకర్లకు తగిన మార్పులుచేయాలని చెప్పారు.
నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపడానికి 24 గంటలు పనిచేసేలా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ బృందాలను ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్నింటిని సమకూర్చుకోవడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లతో చర్చించాలని సూచించారు. సమావేశంలో అర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, స్టాంపులు, రిజిష్ట్రేషన్లశాఖ కమిషనర్ శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎంరావు తదితరులు పాల్గొన్నారు.
గాంధీలో కరోనా రోగుల కోసం అదనంగా 160 పడకలు సిద్ధంచేసినట్టు సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీతో కలిసి గాంధీ హాస్పిటల్ను సందర్శించారు. 4 టన్నుల సా మర్థ్యంతో నెలకొల్పిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాం టును సీఎస్ ప్రారంభించారు. లైబ్రరీ భవనంలో అదనపు పడకలకు ఈ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లుచేయాలన్నారు.