బోనకల్లు: మధిరలో ఈ నెల 3న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన టీఆర్ఎస్ పార్టీ మండల, గ్రామ కమిటీలతో పాటు, అనుబంధ సంఘాలు,సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్కుమార్,రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతో పాటు,జిల్లా నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండలంలోని పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీమండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి చావా హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి సయ్యద్ మదార్సాహేబ్, దుగ్గిబోయిన నాగయ్య, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, మండల కార్మిక శాఖ అధ్యక్షులు బంధం నాగేశ్వరరావు, మండల నాయకులు దారగాని నారాయణ, కొమ్మినేని సత్యనారాయణ, షేక్ పెంటూసాహేబ్, దొప్పా కృష్ణ, బంధం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.