ఏన్కూరు : రెండోసారి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి హైదరాబాద్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏన్కూరు టీఆర్ఎస్ మండల నాయకులు హాజరై పల్లాకు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా లాలునాయక్, నాయకులు షేక్ గాలీబ్, ఇస్నేపల్లి నాగేశ్వరరావు, వీరునాయక్, తదితరులు పాల్గొన్నారు.