రాజ్యాంగ నిర్మాతగా యావన్మంది ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆదివారం ఆయన జయంతిని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల ఆధ్వర్యంలో, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, అందించిన సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు.