ఖమ్మం :జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సూచన మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్లో పని చేస్తున్న 30 మంది ఉద్యోగులకు మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్ చేశారు.