తిరుమలాయపాలెం, ఏప్రిల్ 27 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు పెట్రోల్ బంకులో డీజిల్, పెట్రోల్ కొరత కారణంగా ఇదే అదనుగా భావించి బయట కిరాణం షాపుల్లో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు.
వెదుల చెరువు క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంకులో రేషన్ ప్రకారం డీజిల్ సప్లై చేశారు. అయితే.. మండలంలోని బీరోలు ఇండియన్ ఆయిల్ బంకులో రాత్రి వేళలో లోడ్ రావడంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకు వద్ద బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో కొందరు కిరాణ దుకాణాల్లో అధిక ధరకు అమ్ముతున్నారు. గత్యంతరం లేకపోవడంతో వాహనదారులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.