ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాష్ట్ర ప్రభుత్వం వారికి శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ఆర్థిక, విద్యుత్శాఖలు, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి పరిశ్రమ శాఖలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖలు కేటాయించింది. మంత్రులకు కేటాయించిన శాఖల్లో విద్యుత్శాఖ మినహా మిగిలిన అన్ని శాఖలూ జిల్లా మంత్రులు మొదటిసారి బాధ్యతలు నిర్వహిస్తున్నవి కావడం గమనార్హం. అలాగే హైదరాబాద్లోని అసెంబ్లీలో ఉభయ జిల్లాల ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా రాగమయి, రాందాస్నాయక్, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం వారికి శాఖలను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్ శాఖలను, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి పరిశ్రమల శాఖలను, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖలను కేటాయించింది. అయితే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయా మంత్రులకు శాఖలను కేటాయిస్తారని ప్రచారం జరిగినా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. చివరికి శనివారం ఆయా మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులకు కేటాయించిన శాఖల్లో విదు
్యత్ మినహా అన్ని శాఖలు ఖమ్మం జిల్లా మంత్రులకు మొదటిసారి బాధ్యతలు నిర్వహిస్తున్నవి కావడం గమనార్హం. ఇప్పుడు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించగా.. ఇదే శాఖ బాధ్యతలను 1989-94 మధ్య ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయ్భాస్కర్రెడ్డి మంత్రివర్గంలో అప్పటి మంత్రి సంభాని చంద్రశేఖర్ నిర్వర్తించారు. ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, సమాచార, గృహ నిర్మాణం, చేనేత, జౌళి శాఖలు గతంలో జిల్లా మంత్రులుగా ఉన్న వారెవ్వరికీ కేటాయించలేదు. ఆయా శాఖలను మంత్రులకు కేటాయించడంతో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు హైదరాబాద్లో మంత్రులను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం
మధిర శాసన సభ్యుడు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం శాసనసభ సభ్యుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు శాసనసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శాసనసభ తొలి సమావేశంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సత్తుపల్లి, వైరా శాసనసభ్యులుగా ఎన్నికైన మట్టా రాగమయి, రాందాస్నాయక్లు శనివారం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
భద్రాద్రి జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి… ముగ్గురు పాతవాళ్లు
భద్రాద్రి జిల్లా నుంచి మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణ, కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరో ముగ్గురైన కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్లారు. సీపీఐ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్కరు ఎమ్మెల్యేగా పోటీ చేసి కొత్తగూడెం నుంచి గెలిచి విజయం సాధించారు. ఆయన సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. జిల్లా నుంచి నలుగురు ఎస్టీ నియోజకవర్గాల నుంచి ఆదివాసీ ఎమ్మెల్యేలు గెలిచారు.