రఘునాథపాలెం, జనవరి 29 : తప్పుడు పత్రాలతో శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నాన్ని గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఖమ్మం నగర ఏడో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, స్థానిక పెద్దలు తెలిపిన ప్రకారం.. టేకులపల్లికి ఆనుకొని ఉన్న ఎన్నెస్పీ కాలువ వద్ద సర్వే నంబర్ 93లో కొంతభూమిని ప్రభుత్వం అప్పట్లో స్వాధీన చేసుకుంది. అయితే మిగులు భూమిగా ఉన్న స్థలాన్ని దశాబ్దాలుగా శ్మశానవాటికకు కేటాయించారు. ఈ శ్మశానవాటికను టేకులపల్లితోపాటు చైతన్యనగర్, రోటరీనగర్, శ్రీనగర్ కాలనీ, లక్ష్మీనగర్ ప్రాంతాల ప్రజలు వినియోగించుకుంటున్నారు.
కాగా రెండురోజుల క్రితం శ్మశానవాటికలోని కొంత స్థలాన్ని పేరెల్లి వీరస్వామి, పేరెల్లి ప్రవీణ్ ఆక్రమించేందును భూమి చదును పనులు చేపట్టారు. విషయం తెలిసిన స్థానికులు శనివారం ఖమ్మం అర్బన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి ఆక్రమణ ప్రయత్నాన్ని ఆదివారం అడ్డుకున్నారు. శ్మశానవాటిక స్థలాన్ని కాపాడుకునే చర్యలు చేపట్టారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్పొరేటర్తోపాటు గ్రామపెద్దలు పొదిల పెద్ద పాపారావు, తంగెళ్ల సింహాద్రి, చిలకల వెంకటనర్సయ్య, దొంగల తిరుపతిరావు, వాకదాని రమణ, పొదిల భిక్షం, దురిశెట్టి వెంకన్న, చిలకల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ధనుంజయ్, వార నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.