న్యూఢిల్లీ, మే 10: దేశాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ‘రైడింగ్ యాప్- ఓలా’ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఓలా మొబైల్ యాప్ ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా సమకూర్చనున్నది. వాటిని ఇంటి వద్దకు తీసుకువచ్చి అందజేస్తుంది. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయదు. వాటి అవసరం తీరాక తిరిగి తీసుకువెళుతుంది. వచ్చే వారం బెంగళూరులో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఓలా ఫౌండేషన్ తెలిపింది.