ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆయా మైదానాల్లో చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలు, త్రివర్ణ పతాకాలను చేబూని చేసిన విన్యాసాలు, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ అభివృద్ధిని ప్రతిబింబింపజేసే శకటాలు, స్టాళ్లు, ఫొటో ఎగ్జిబిషన్లను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
– నమస్తే నెట్వర్క్