Aకమాన్చౌరస్తా, జూన్ 18 : జేఈఈ అడ్వాన్డ్స్ – 2023 ఫలితాలు ఆదివారం విడుదల కాగా, అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి కేంద్రంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ప్రత్యేక ప్రణాళిక, పటిష్టమైన బోధనా సిబ్బంది తీరు, కష్టపడి చదివగలిగే విద్యార్థుల పట్టుదలతోనే ర్యాంకు సాధ్యమయ్యాయన్నారు. ఇందులో బీ లోకేశ్ 115వ ర్యాంకు సాధించగా, ఏ ఇషాంత్ రెడ్డి 282, అభిరామ్ 306, శశిప్రీతమ్ 467, వాగ్దేవి 660, వివేకవర్ధన్ 916, బీ ప్రవీణ్ 1012, సాయిచరణ్ 1176, గౌతమ్ 1245, రిషీ 1297, అభినయ్ 1331, కౌశిక్ 1365, అనుదీప్ 1413, ఏ వంశీకృష్ణ 1905, రోహిత్ 1956, శ్రీనివాస్ 2040, శ్రీహర్ష 2173, ఉజ్జ్వల్ 2257, సంపత్ 2282, వేణుగోపాల్ 2363, టీ వైష్ణవి 2390, అభినవ్ 2488, ప్రణతి 2808, అఖిల్ 2951, బీ శ్రీజిత్ 3064, శ్రీసదన్ 3423, వినయ్ రాజ్ 3499, అధిత్య 3518, హూటి 3585, శ్రీచరణ్ 3769, సుహాసిత 3784, ఎన్ విష్ణుతేజ కుష్ 3928, అస్ట్రాల్ 4186, ప్రసూన 4500, కే సాయిదీక్షిత్ 4576, బీ ఆసూశ్రీ 4589 ర్యాంకులు సాధించారన్నారు. 5వేల లోపు 36 మంది విద్యార్థులు, 10వేల లోపు 50 మందికి పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ ప్రతిష్టాత్మక ఐఐటీలలో సీట్లు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
జేఈఈ అడ్వాన్డ్స్లో మంచి ర్యాంకు వచ్చింది. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసి నన్ను ఉన్నతంగా చదివించారు. వారి కలలు నిజం చేసేలా మంచి ర్యాంకు సాధించా. మంచి ఐఐటీలో సీటు సాధించి రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందు కోసం అధ్యాపకుల సహకారం మరువలేనిది.
– ఏ ఇషాంత్ రెడ్డి, 282 ర్యాంకు, అల్ఫోర్స్ కళాశాల
దేశంలోనే టాప్ ఐఐటీలో సీటొస్తుంది. నా తల్లిందండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది. వారు అందించిన ప్రోత్సాహంతోనే ఐఐటీ పరీక్షల్లో రాణించి మంచి ర్యాంకు సాధించా. ఇదే పట్టుదలతో సివిల్స్ లక్ష్యంగా ప్రిపేరవుతా. సివిల్స్లో మంచి మార్కులు సాధించి ఐఏఎస్ కావాలన్నదే నా సంకల్పం.
– బీ లోకేశ్, అల్ఫోర్స్ కళాశాల