వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి, అనుబంధ దేవతామూర్తులకు ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తుంటారు. అందు లో వాడే పూలను ప్రతిరోజు ఆలయ అధికారులు కొనుగోలు చేస్తారు. స్వామివారికి ఎనిమిది పెద్ద దండలు, అనుబంధ దేవాలయాల దేవతా మూర్తులకు చిన్నవి 30 దండల దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక స్వామివారికి పూజలో వినియోగించే విడిపూలు ఆలయ పూదోట నుంచి సేకరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ కొనుగోలు చేసే పూలే 15 కిలోల దాకా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు భక్తులు సమర్పించే పూలతో కలిపి దాదాపు రోజూ 25 కిలోల పూల దాకా అవుతాయని అంచనాకు వచ్చారు. అయితే వాడిన పూలను ఆ రు బయట పడవేయకుండా తిరిగి వినియోగించాలని నిర్ణయించారు. పూలను ఎండబెట్టి సుగంధ ద్రవ్యాలను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాల తయారీకి మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశముండగా, ఏదైనా స్వచ్ఛంద సంస్థ, మహిళా సంఘాల గ్రూపులకు అప్పగించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. అయితే ఆలయంలో వచ్చే పూలను ఇకడే తయారు చేసి ఇకడే వినియోగించేలా నిబంధనలు అమలు చేస్తారని చెబుతున్నారు.
అనుమతిని కోరుతున్నాం..
రాజన్న ఆలయంలోని దేవతామూర్తుల పూజలో వినియోగిం చే పూలను తిరిగి వినియోగంలోకి తేవాలని చూస్తున్నాం. ప్ర స్తుతం దేవస్థానం తరపున ప్రతిరోజూ 15 కిలోల పూల వరకు స్వామివారికి, ఇతర దేవతా మూర్తులకు వినియోగిస్తున్నాం. వా టిని వినియోగించుకొని సుగంధ ద్రవ్యాలు తయారుచేసి స్వామివారి బ్రాండ్ పేరిట ఇకడే వినియోగించేలా దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి కోరుతున్నాం. అనుమతులు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
– కృష్ణ ప్రసాద్, ఈవో, రాజన్న ఆలయం (వేములవాడ)