పెన్సిల్ గ్రాఫైట్పై తాజ్మహల్, వరల్డ్ కప్ నమూనా, బియ్యం గింజపై త్రివర్ణ పతాకం, చాక్పీస్తో వేలి గోటిపై పట్టే పరిమాణంలో ఒక సెంటీమీటర్ ఎత్తుతో బతుకమ్మ, క్రిస్మస్తాత, కేసీఆర్ విగ్రహం.. ఇన్నా ఎన్నో కళారూపాలతో అబ్బుపరుస్తున్నారు ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్! సూక్ష్మకళలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
పెద్దపల్లి, మార్చి13 (నమస్తే తెలంగాణ) : ‘అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల’ కాదేదీ కళకు అనర్హం అన్నట్టు సూక్ష్మకళలో రాణిస్తున్నాడు ఓదెల మండలం మడకకు చెందిన ఆడెపు రజనీకాంత్. బ్లాక్ బోర్డుపై రాసేందుకు మాత్రమే ఉపయోగించే చాక్పీస్తోపాటు ఇంట్లోని అగ్గిపుల్లలు, కోడిగుడ్డు డొల్లలు, పెన్సిల్ మొనలు, బియ్యపు గింజలు, కొవ్వొత్తులతో అతి సూక్ష్మ కళాఖండాలు ఆవిష్కరిస్తున్నారు. 2018లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాలలో ఆర్ట్ టీచర్ కొలువు సాధించిన రజినీకాంత్, ఓవైపు టీచర్గా పనిచేస్తూనే.. మరోవైపు తన అభిరుచిని చాటుతున్నారు. ఇప్పటివరకు చాక్పీస్లతో వివిధ ఆకృతుల్లో 500 రకాల ఆకృతులు చెక్కి ప్రపంచరికార్డులో తన పేరును నమోదు చేసుకున్నాడు. రెండు బియ్య పు గింజలపై 278 ఆంగ్ల అక్షరాలతో జాతీయగీతం జనగణమనను లిఖించినందుకు గాను తెలంగాణ భాషా సాంసృతిక శాఖ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ నుంచి 2016లో గ్రామీణ కళాజ్యోతి అవార్డు అందుకున్నారు. ఒక్క బియ్యం గింజపైనే 72 ఇంగ్లిష్ అక్షరాలు రాసి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ వారి సృజన పుత్ర అవార్డు దక్కించుకున్నారు. పెన్సిల్ గ్రాఫైట్పై వినాయక ప్రతిమను చెక్కడంతో రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. బి య్యపు గింజపై మూడు మిల్లీ మీటర్ల ఎత్తులో త్రివర్ణపతాకాన్ని చెక్కి ఔరా అనిపించారు. అలాగే ఎంతో మహనీయుల విగ్రహాలను సూక్ష్మాతిసూక్షంగా చెక్కి అబ్బురపరిచారు. అంతేకాదు మడక పంచాయతీ, పాఠశాల గో డలపై, పల్లెప్రకృతి వనంలో తెలంగాణ సం స్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా తన సొంత డబ్బులతో పెయింటింగ్స్ వేశారు. తన కళతో ఎన్నో అవార్డులు పొందారు. రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, రికార్డ్ హోల్డర్ రిపబ్లిక్ ఇండియా వరల్డ్ రికార్డ్(ఆర్హెచ్ఆర్) రికార్డులను సొంతం చేసుకున్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకను పెంచేలా రజనీకాంత్ వృత్తిని కొనసాగిస్తున్నారు. పేపర్ వర్క్స్, ఒరిగామి, బెస్ట్ ఔట్ఆఫ్ వేస్ట్, ట్రైబర్ ఆర్ట్, వార్లి పెయింటింగ్స్, ఐస్క్రీం స్టిక్ వర్క్స్, కొలాజ్ పేపర్వర్క్స్, మధుబని, నకాశి, కలంకారి వర్క్స్ను వారికి నేర్పిస్తున్నారు. చక్కని ఇన్పుట్స్ ఇస్తూ రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ప్రతిభను చాటేలా తర్ఫీదును ఇస్తున్నారు.