కమాన్చౌరస్తా, జనవరి 24: జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంగళవారం ఉదయం, సాయంత్రం అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఆలయంలో నమిలకొండ రాజగోపాలాచార్యులు, దెబ్బట శ్రీధరాచార్యులు, సేనాపతి శేషాచార్యులు, శ్రీపెరంబుదూరు మురళీధరాచార్యులు, రాజారాంమ్మోహన్, లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు ప్రబంధ పారాయణం చేశారు. పూజా కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్రావు పాల్గొన్నారు. కళాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో వెంకన్న, ఉత్సవ కమిటీ బాధ్యులు గంప రమేశ్, గోగుల ప్రసాద్, రవీందర్, దేవత, రవికుమార్, సంతోష్కుమార్, తిరుపతి, వనిత, లత, రాహుల్ నారాయణ, ఉపేంద్రనాథ్, శ్రీనివాస్, శ్రీనివాసవరప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్ శ్రీధర్, భూపతి, విద్యాసాగర్, రామన్న, సుభాష్, సీహెచ్ ప్రశాంత్కుమార్, ఆర్ భద్రయ్య, భాసర్, కార్పొరేటర్లు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఈవెంట్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (టీఈఐఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆరెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల ప్రసాద్ నేతృత్వంలో ఉదయం శ్రీ వేంకటేశ్వర, వ్రీరబ్రహ్మేంద్రస్వామి, గీతాసంచార్ సత్సంగ్ భజన మండలి సభ్యులు భజన చేశారు. సాయంత్రం భగత్నగర్ పావని బృందం భక్తి సంకీర్తనలు, శారద సంగీత పాఠశాల విద్యార్థులు భక్తి కీర్తనలు, చిలువేరు శ్రీకాంత్, గజ్జెల రాజు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. వంగల సురేంద్రాచారి శిష్య బృందం భరత నాట్యం, బాలాత్రిపురసుందరి నాట్యాలయ బృందం కూచిపూడి నృత్యం, సినీ గాయని శ్రీలలిత, జీ తెలుగు సరిగమ ఫేం శ్రీకృతి భక్తి సంగీత విభావరి, వేములవాడ పొలాస వినయ్ కృష్ణ వాయోలిన్ కచేరి అలరించాయి.
బుధవారం ఉదయం ప్రబంధ పారాయణం, తీర్థప్రసాద గోష్ఠి, సాయంత్రం పరమపదోత్సవం ఉంటుంది. ఉదయం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.