చొప్పదండి, డిసెంబర్ 12: కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కాట్నపల్లిలో అంబేద్కర్ సంఘ భవనాన్ని ప్రారంభించారు. కాట్నపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిని పాలకులు పట్టించుకోకపోవడంతో ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తులను నమ్ముకున్న వారికి భరోసానిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కులవృత్తుల వారికి జీవనోపాధి కల్పించడంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, సర్పంచులు కోలపూరి తులసమ్మ, పెద్ది శంకర్, లింగంపెల్లి లావణ్య, రామకృష్ణ, ఎంపీటీసీ కట్టెకోల తార, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, ఉప సర్పంచ్ ఇప్ప శ్రీనివాస్రెడ్డి, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ గన్ను శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏనుగు స్వామిరెడ్డి, వడ్లూరి భూమయ్య, ఉస్కెమల్ల మధు, నాయకులు మాచర్ల వినయ్, గ్యాజంగి రాములు, గాండ్ల లక్ష్మణ్, కడారి వెంకటేశ్, రవి, బండారు స్వామి, దండె కృష్ణ, రావణ్, మావురం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.