విద్యానగర్, మార్చి1 : కరీంనగర్లో మూడురోజుల పాటు నిర్వహించనున్న న్యూరో వైద్యుల 8వ రాష్ట్ర స్థాయి వైద్య సదస్సును రేనె హాస్పిటల్లో న్యూరో వైద్యులు శుక్రవారం సుకుమార్రెడ్డి, మానస్ఫణీగ్రహి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి నుంచి లైవ్ సర్జరీలు సీఎంఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యూరో సర్జన్లు, ఫిజీషియన్లు, వైద్య విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.