పెద్దపల్లి, నవంబర్2: ఉమ్మడి పాలనలో ఆగమైన గీత కార్మికులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ సర్కారేనని రాష్ట్ర కల్లు గీత కార్మిక సం క్షేమ సంఘం చైర్మన్ పల్లె రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. వారి అభ్యున్నతికి అనేక పథకాలు అ మలు చేసిందని చెప్పారు. చెట్టుపై నుంచి పడి గాయపడ్డ, మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పించిందన్నారు. చెట్లపై పన్నును రద్దుచేసి ఆర్థిక భరోసానిచ్చిందన్నారు. గురువారం పెద్దపల్లిలోని ఓ గార్డెన్స్లో గౌడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
మండలి మాజీ చైర్మన్ కే స్వామిగౌడ్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, రాష్ట్ర సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి రవీందర్సింగ్తో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్ధార్ పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ సముచిత గౌరవమిచ్చారని కొనియాడారు. అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఉత్త హామీలను నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వడ్లకొండ ఎల్లస్వామి, తాళ్లపెల్లి మనోజ్ గౌడ్, సురువు రాజేశం, పీఏసీఎస్ డైరెక్టర్ మాచర్ల అశోక్ పాల్గొన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే కులవృత్తులను ప్రోత్సహించాలని భావించి సీఎం కేసీఆర్ ఈ దిశగా అనేక చర్యలు చేపట్టారు. చెట్లపై పన్నును రద్దు చేశారు. చెట్టు మీద నుంచి పడి మరణించిన కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇస్తున్నది. మనల్ని ఆదుకంటున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలువాలి.
– రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కే స్వామి గౌడ్
మీరు ఆదరిస్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. మీరు ఆశించిన మేరకు అభివృద్ధి చేసిన. మరోసారి నాకూ సీఎం కేసీఆర్ ఆవకాశం ఇచ్చారు. గౌడ కులస్తుల ఆశీర్వాదం అవసరం. మళ్లీ గెలిపిస్తే పెద్దపల్లి నియోజక వర్గాన్ని రోల్ మాడల్గా తీర్చిదిద్దుతా. గౌడ కులస్తులకు ఎల్లప్పుడు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరు కారు గుర్తు ఓటు వేయాలి.
– పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి