శ్రీరామనవమి బుధవారం అంబరాన్నంటింది. ఊరూరా సీతారాముల కల్యాణం జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తుల సమక్షంలో కనుల పండువగా సాగింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ఇల్లందకుంట రామాలయం, ధర్మపురి నృసింహస్వామి,
కొండగట్టు అంజన్న, గోదావరిఖని కోదండ రాముడి ఆలయాలు కిక్కిరిసిపోగా, ఎటు చూసినా సందడి కనిపించింది. ఆయాచోట్ల జరిగిన వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 17