కమాన్చౌరస్తా, జూన్ 26 : రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సోమవారం ప్రారంభమైంది. అందుకోసం విద్యార్థులు టీఎస్ ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఉండి, ఇంటర్లో ఓసీలు 45 శాతం, ఇతరులు 40 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండా లి. వారు స్లాట్ బుకింగ్ http:/tseamcet. nic.inలో నమోదు చేసుకోవాలి. ఈ సదుపా యం జూన్ 26వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుండగా, ఇందులో నమోదు చేసుకున్న విద్యార్థులకు జూన్ 28వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీలు రూ. 600 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థు లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసున్న నాలుగు సహాయ కేంద్రాల్లో ఏదేని ఒకటి ఎంపిక చేసుకొని, తేదీ, సమయంతో స్లాట్ బుక్చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు తెలిపిన ధ్రువపత్రాలతో స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో సహాయ కేంద్రంలో హాజరు కావాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలోని సహాయ కేంద్రాలు..
ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే లా తమ సమీప సహాయ కేంద్రంలో వారు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావచ్చు. ఉద యం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అ ధికారులు ధ్రువీకరణ పత్రాలు పరీశీలిస్తారు. ఈ క్రమంలో ప్రతి 30 నిమిషాలకు ఒక స్లాట్ ఉం టుంది. విద్యార్థి ఆన్లైన్లో సూచించిన సమయానికి సహాయ కేంద్రానికి చేరువాల్సి ఉంటుంది.
కొత్త జిల్లాల వారీగా..
కరీంనగర్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల
రాజన్న సిరిసిల్ల : ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం
జగిత్యాల : ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగిత్యాల
పెద్దపల్లి : యూనివర్సిటీ పీజీ కళాశాల, గోదావరిఖని. అలాగే, విద్యార్థులు స్పోర్ట్స్, క్యాప్, దివ్యాంగులు, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక కేటగిరీలో అవకాశం ఉంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసాబ్ట్యాంకు, హైదరాబాద్లో హాజరుకావాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ జరిగే తీరు..
విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రానికి 30 నిమిషాల ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు ఒరిజినల్ ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఇంటర్ ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. అనంతరం విద్యార్థులు వెంట తీసుకెళ్లిన రెండు జిరాక్స్ సెట్లు అధికారులకు అప్పజెప్పి, మ్యానువల్ ఆప్షన్ ఫాం అడిగి తీసుకొని కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటికి రావచ్చు. ఈ సమయంలో విద్యార్థులు తమ మొబైల్ నంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నంబర్ కళాశాలల్లో చేరే వరకు ఉంచుకోవాలి. అదే నంబర్కు టీఎస్ ఎంసెట్ నుంచి వచ్చే మెసేజ్లు, సమాచారం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
వెబ్ ఆప్షన్ల నమోదు..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత విద్యార్థులు మ్యానువల్ ఆప్షన్ ఫాంలో తాము చదవాలనుకుంటున్న కళాశాల, కోర్సును ప్రాధాన్యతాక్రమంలో రాసుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు కేటాయించాల్సి ఉంటుంది. దీనికోసం ఇంట్లో కంప్యూటర్ ద్వారా, లేదా ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల ద్వారా తమ క్రమాన్ని నమోదు చేసుకోవచ్చు. అంతకుముందు విద్యార్థులు ఇంటర్నెట్ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. అయితే, సీటు కేటాయింపు ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమంలోనే జరుగుతుంది. ఇది నాలుగు విడుతలుగా చేస్తారు.
ఆప్షన్ల విషయంలో జాగ్రత్త తప్పనిసరి..
ఎంసెట్ ఇంజినీరింగ్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వెబ్ ఆప్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు విద్యార్థుల భవిష్యత్తుకే ఇబ్బంది కలిగించేలా మారుతాయి. ఇందులో మొదటి విడుత కౌన్సెలింగ్ చాలా కీలకం. మొదటి విడుతలో మంచి కళాశాల ఎంపికలో తప్పు జరిగితే, రెండో కౌన్సెలింగ్ వచ్చేసరికి మంచి కళాశాలల్లో సీట్లు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకోసం విద్యార్థులు మొదటగానే కళాశాల పేర్లు, ప్రాధాన్యతాక్రమం రాసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇందులో తమకు వచ్చిన ర్యాంకును గతేడాది కేటాయించిన కళాశాల, కోర్సు వివరాలు ఇంటర్నెట్ ద్వారా చూసుకుంటే విద్యార్థులు ఆప్షన్ల ఎంపికలో సహాయకంగా ఉంటుంది. అలాగే, వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత విద్యార్థులు ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. దీని ద్వారా కంప్యూటర్ ఆఫ్ అయినా, ఇంటర్ నెట్ సమస్య ఎదురైనా ఆప్షన్లు పెట్టుకున్నంత వరకు తొలగిపోకుండా ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రింట్ తీసుకొని, ఫాంను పీడీఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.
లాగిన్ ఐడీ జాగ్రత్త..
విద్యార్థులు రిజిస్టర్ మొబైల్ నంబర్కు టీఎస్ ఎంసెట్ ద్వారా లాగిన్ ఐడీ వస్తుంది. విద్యార్థి లా గిన్ అయిన ప్రతిసారీ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేంత వ రకు విద్యార్థి వేచిచూసి లాగిన్ కావాల్సి ఉంటుం ది. ఈ క్రమంలో వరుసగా ఓటీపీలు వస్తే చివరగా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.