కోరుట్ల, మార్చి 10: డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి కోరుట్లలో సందడి చేసింది. శుక్రవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన కిసాన్ షాపింగ్ మాల్ను ప్రారంభించింది. కాగా, నేహా శెట్టిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా, ఆమె మాల్ బ యటకు వచ్చి అభివాదం చేశారు. డీజే టిల్లు సి నిమా సాంగ్కు స్టెప్పులు వేసి ఉత్సాహ పరిచారు. మాల్లో కలియదిరిగిన ఆమె, కోరుట్లకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఫ్యా షన్ మాల్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కిసాన్ ఫ్యాషన్ మాల్ అధినేత దన్పాల్ సూర్యనారాయణగు ప్తా మాట్లాడుతూ 70 ఏళ్ల నుంచి వస్త్ర వ్యాపారంలో రాణిస్తున్నామని, మారుమూల ప్రాం తాల్లో సైతం ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులను అందించడమే లక్ష్యం గా కిసాన్ ఫ్యాషన్ మాల్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక్కడ పట్టణ పుర ప్రముఖులు, కిసాన్ షాపింగ్ మాల్ నిర్వాహకులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.