ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సంయుక్తంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజులపాటు వేలాది మందితో రెవెన్యూ గార్డెన్స్ కిటకిటలాడింది. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన నిర్మాణ రంగ సంస్థలు, బ్యాంకులు స్టాళ్లు ఏర్పాటు చేయగా, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లు, విల్లాల ధరలతోపాటు వ్యాపారాలు, భూములు, ఇండ్ల కొనుగోలుకు అందిస్తున్న రుణాల గురించి తెలుసుకున్నారు. అలాగే, సోలార్ విద్యుత్కు సంబంధించిన వివరాలను సేకరించారు. పలువురు నిర్మాణాలు, స్థలాల కోసం అడ్వాన్స్లు చెల్లించగా, సందర్శకుల స్పందనను చూసి వ్యాపార సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్/ కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 10 : నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంగా రెండు రోజులపాటు ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో శుక్ర, శనివారాల్లో ఈ ఎక్స్పో నిర్వహించారు. హైదరాబాద్తోపాటు కరీంనగర్కు చెందిన ప్రముఖ రియల్ సంస్థలు, నిర్మాణ రంగానికి సంబంధించిన సోలార్, సిమెంట్, వుడ్కు సంబంధించిన సంస్థలు, రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, బిల్డర్స్ తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు షో నిర్వహించగా, రెండు రోజుల్లో 1200కు పైగా సందర్శకులు స్టాళ్లను సందర్శించారు.
సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. నిర్మాణ రంగ సంస్థల ప్రాజెక్టులు, వ్యయాలు, లోన్లు ఇతర వివరాలను తెలుసుకున్నారు. కొందరు ప్లాట్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలను బుక్ చేసుకొని అడ్వాన్సులు కూడా చెల్లించారు. ప్రజలతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వచ్చి స్టాళ్లను పరిశీలించారు. శనివారం ఆర్టీసీ ఆర్ఎం సుచరిత సందర్శించి అభినందనలు తెలిపారు. ప్రతి రోజూ రెండు గంటలకోసారి ప్రత్యేకంగా లక్కీ డ్రా తీసి, గిఫ్ట్లను అందించారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ముగింపు కార్యక్రమం నిర్వహించగా, ఆర్డీవో మహేశ్వర్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు హాజరయ్యారు.
రెండో రోజు లక్కీ డ్రా ద్వారా నలుగురు సందర్శకులకు ఉచితంగా బహుమతులను అందించారు. ముగింపు సందర్భంగా బాల భవన్ విద్యార్థులు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్నారులు నృత్యాలతో ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్రావు, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, సర్క్యులేషన్ మేనేజర్ పురుషోత్తం, బాల భవన్కు చెందిన మంజులాదేవి, డాన్స్ మాస్టర్ సంగం రాధాకృష్ణ, సూర్య శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
ప్రాపర్టీ షో ముగింపు సందర్భంగా పాల్గొని స్టాళ్ల నిర్వాహకులకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ చేతుల మీదుగా మెమొంటోలను అందించారు. ఉప్పులూరి కృష్ణమూర్తి (ఎడ్వెన్సా సెంచరీ అపార్ట్మెంట్స్), దిలీప్కుమార్ మోట్వాని (రాయిచందని సింద్ డెవలపర్స్), ఇంతెషామ్ ఉస్మాని (ఉస్మాని అసోసియేట్, కన్స్ట్రక్షన్స్), రమణారెడ్డి (శాంతశ్రీరాం కన్స్ట్రక్షన్స్), కోడూరి అంజిప్రసాద్ గౌడ్ (కేకే ఎంటర్ ప్రైజెస్), ఎనుమట్ల శ్రీధర్ (వెకా స్మార్ట్ విండో సొల్యూషన్స్), గసికంటి అజయ్కుమార్ (వైషు విజన్ సెక్యూరిటీస్), వీ శివరామకృష్ణ (రెప్కో హోం ఫైనాన్స్), ఎస్ నాగార్జున (మైహోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మహాసిమెంట్), వీ ప్రతాప్ (బ్యాంక్ ఆఫ్ బరోడా), రాంచంద్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), కే సంతోష్రావుజీ (సారథి ఇన్ఫ్రా డెవలపర్స్, బిల్డర్స్), జీ హనుమంతరావు (కేడీసీసీబీ), వీ శంకర్రెడ్డి (ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్), వీ మారుతి (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఈ ప్రసాద్ (మోడీ ప్రాపర్టీస్), సీహెచ్ శ్రీధర్రెడ్డి (డ్యూరో ైప్లె ఇండస్ట్రీస్), జీ ప్రశాంత్ (సోని సోలార్ పవర్) జ్ఞాపికలు అందుకున్నారు.
ప్రాపర్టీ షోకు ఆదరణ బాగున్నది. మా సంస్థ ద్వారా మధ్య తరగతికి అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నాం. ప్రజల అభిరుచుల అనుగుణంగా నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పుటికే నాలుగు నిర్మాణాలు అందుబాటులోకి తీసుకువచ్చాం.
– శంకర్ రెడ్డి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్
విలాసవంతమైన నిర్మాణాలవైపు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది మా స్టాల్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నది. ప్రాపర్టీషోతో మేమే ప్రజలకు వద్దకు వచ్చినట్టు ఉన్నది. నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే నిర్వాహకులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
– నిరంజన్, ఏఎస్ఎం (మోడీ ప్రాపర్టీస్)
పెద్దపెద్ద అపార్ట్మెంట్ల నుంచి విల్లాల వరకు అతితక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి ఇంటికీ ఒక చెట్టు అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. మా స్టాల్ వద్ద వివరాలు తెలుసుకుంటున్నారు. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
– రమణారెడ్డి, శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్
స్టేట్ బ్యాంక్ ఇండియా ద్వారా వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారికి మా బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలను సిబ్బంది వివరించారు. పలువురు ఇంటి రుణాల కోసం మమ్మల్ని సంప్రదించారు.
– ఉదయ్, మేనేజర్ (ఎస్బీఐ)
గృహనిర్మాణ రంగంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాం. ప్రాపర్టీ షోకు పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చారు. మా బ్యాంక్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను వివరించాం. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మా బ్యాంకు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– మారుతి, చీఫ్ మేనేజర్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
రెప్కో హోం ఫైనాన్స్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఇండ్ల నిర్మాణాలకు రుణాలు అందిస్తున్నాం. అందులో స్థలాలు, గృహాలు, హౌస్ మార్డిఫికేషన్, డెవలప్మెంట్, ఎన్ఆర్ఐ ఇలా అన్ని రకాలుగా రుణాలు అందిస్తున్నాం. ప్రాపర్టీ షోలో ఆదరణ బాగున్నది. అన్ని ప్రభుత్వ బ్యాంకులతో సమానంగా గృహ రుణాలు అందించడంలో మేం ముందుంటాం.
– భరత్, మేనేజర్ (రెప్కో హోం ఫైనాన్స్)
ప్రాపర్టీ షోలో మా సంస్థ ద్వారా అందిస్తున్న నాణ్యమైన సేవలను వివరించాం. అందులో మా వద్ద ఉన్న ఉన్నత శ్రేణి కెమెరాల పనితీరు, వాటిని అమర్చే విధానం, సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, నూతన భవనాల్లో ఏర్పాటు చేసుకునే కెమెరాలు పని తీరును సైతం ఇక్కడ ప్రదర్శించాం. వీటికి ఆదరణ చాలా బాగున్నది.
– అజయ్, వైషు విజన్ సెక్యూరిటీస్
ప్రాపర్టీషోలో మా స్టాల్కు ఇంతటి స్పందన వస్తుందని ఊహించలే దు. చాలా మంది సందర్శించారు. మా వద్ద ఉన్న ైప్లెవుడ్ ఉత్పత్తులను పరిశీలించారు. మాది అందరికీ తెలిసిన సంస్థ కావడం, జీవిత కాలం మన్నిక ఉండే ఉత్పత్తులు అందిస్తుండడంతో చాలా మంది మా ఉత్పత్తులను వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– హరిప్రసాద్ వర్మ, డ్యూరో ైప్లె
ప్రాపర్టీషోకు పెద్ద సంఖ్యలో సందర్శకు లు తరలి వచ్చారు. వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా సేవలు వినియోగించుకోవాలని సూచనలు ఇచ్చాం. ఇప్పుడున్న బ్యాంకింగ్ రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తున్న బ్యాంక్గా మాకు గుర్తింపు ఉన్నది. దేశంలో ఉన్నత బ్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, చాలా ప్రైవేట్ సంస్థలు మా సేవలు సద్వినియోగం చేసుకుంటున్నాయి.
– ప్రతాప్ వంకుడోతు, జనరల్ మేనేజర్ (బ్యాంక్ ఆఫ్ బరోడా)