గంగాధర, జూన్ 2: సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన బూరుగుపల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే, ఎంపీపీ మధుకర్, గంగాధర, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్రావు, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మల్హోత్ర, సీడీపీవో కస్తూరి, ఎస్ఐ అభిలాష్, ఏపీఎం పవన్, ఏవో శ్వేత, పశువైద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ పద్మ వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేశారు. ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చొప్పదండి, జూన్ 2: చొప్పదండి పట్టణంతో పాటు మండలంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గుర్రం నీరజ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిలుక రవీందర్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రజిత, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం ఇన్చార్జి అజయ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మహేశుని మల్లేశం, మార్కెట్ కమిటీ, సింగిల్విండో డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీల కార్యాలయాల ఆవరణలో సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జూన్ 2: మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కలిగేటి కవిత, ఎమ్మార్సీలో ఎంఈవో అంబటి వేణుకుమార్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో సంజీవరెడ్డి, సెర్ప్ కార్యాలయంలో ఏపీఎం ప్రభాకర్, గోపాల్రావుపేట ఏఎంసీలో వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్రెడ్డి, కొక్కెరకుంట సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, వెలిచాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీర్ల సరోజన, పోలీస్ స్టేషన్పై ఎస్ఐ అంజయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. వెలిచాల ప్రధాన కూడలిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి సర్పంచ్ వీర్ల సరోజన పూలమాల వేసి నివాళులర్పించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, గోపాల్రావుపేట, రామడుగు పీహెచ్సీల్లో వైద్యాధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాల్లో అధ్యక్షులు జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఇతర పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూన్ 2: కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రుద్ర రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జేరిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ-రమేశ్, స్వర్గం నర్సయ్య, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవితా-శేఖర్, జేరిపోతుల శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, శాలిని, మల్లేశం, లక్ష్మయ్య, దేవిక తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూన్ 2: తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్కుమార్, మంద రాజమల్లు, ఆకుల ప్రకాశ్, పెండ్యాల సంపత్, దాసరి కిష్టయ్య, మూల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పూల మాలవేసి నివాళులర్పించారు.
అనంతరం జెండా ఆవిష్కరించారు. వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీటీసీలు బుర్ర తిరుపతి గౌడ్, అంకమల్ల శ్రీనివాస్, వెంగళదాసు శ్రీనివాస్, సాయిల వినయ్సాగర్, మోహన్, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సూపరింటెండెంట్ సంపత్కుమార్, చింతల లక్ష్మణ్, సిబ్బంది ఆరీఫ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగురవేశారు. చెర్లభూత్కూర్లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల్రెడ్డి, ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, వార్డు సభ్యులు ప్రవీణ్రెడ్డి, సుజాత, పద్మ, భాగ్యలక్ష్మి, కూర శ్యాంసుందర్రెడ్డి, అనంతరెడ్డి, అంగన్వాడీ టీచర్ భాగ్య పాల్గొన్నారు. మొగ్దుంపూర్లో సర్పంచ్ జక్కం నర్సయ్య, ఎంపీటీసీ పుష్ప, అంజిరెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సల్మాన్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
నగునూర్లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, కారోబార్ ఫారూక్, నరహరి, తదితరులు పాల్గొన్నారు. నగునూర్లోని ఎస్పీఆర్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ చుక్కారెడ్డి జెండా ఎగురవేశారు. పాఠశాల ఎండీ ఉపేందర్, చైర్మన్ డాక్టర్ విజయమోహన్రెడ్డి, కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ యాకయ్య, డైరెక్టర్ డాక్టర్ పీఆర్ రాజేందర్, డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
బొమ్మకల్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్ జెండా ఎగురవేశారు. పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ పీఏసీఎస్లో సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. సింగిల్ విండో సీఈవో మేకల రమేశ్, వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, డైరెక్టర్లు మూల వెంకటరవీందర్ రెడ్డి, గంట శంకరయ్య, సాయిల మహేందర్, బోనాల తిరుమల్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.