కాల్వశ్రీరాంపూర్, జూలై11: స్వరాష్ట్రంలోనే కులవృత్తులకు ఆదరణ లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గొల్లకుర్మలను ధనికులను చేసేందుకే సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా లబ్ధిదారులందరికీ గొర్రెలు అందజేస్తామని స్పష్టం చేశారు. పనిచేసే సర్కారును ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల, ఓదెల మండలం భీమరిపల్లిలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు యూనిట్లు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గవ్యాప్తంగా 6,600 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో మొదటి విడుత 840 మందికి గొర్రెలు పంపిణీ చేయగా, రెండో విడుతలోనూ 840 మందికి రూ.14.70 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ప్రతిరోజూ 24 యూనిట్లు పంపి ణీ చేస్తున్నామన్నారు. మల్యాలో 53 యూనిట్లు ఉండగా, 33 మంది డీడీలు చెల్లించారని, ఈరోజు 20 మందికి అందించామని, మిగిలిన వారికి త్వరలో అందించనున్నట్లు తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమానికి తపిస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూ చించారు. కాగా, గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కులస్తులు కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పం దించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంప త్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ లంక రాజేశ్వరి సదయ్య, ఎంపీటీసీ గడ్డం రాంచంద్రం, విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి రవీందర్రెడ్డి, డాక్టర్లు సురేశ్, సునిత, పశువైధ్య సిబ్బంది, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్, నాయకులు బూసి సదాశివరెడ్డి, కామిడి వెంకట్రెడ్డి, తాత రాజు, జక్కె రవీందర్, ఆడెపు రాజు, మూడెత్తుల రాజయ్య, ఎరబాటి రవి, కూకట్ల నవీన్, జిన్న రాంచంద్రారెడ్డి, గొడుగు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.